Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మ ధనాధన్ అర్థ సెంచరీ.. 30 బంతుల్లోనే అదుర్స్

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (19:59 IST)
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన ఐదో టీ20లో మొదట బ్యాటింగ్‌ చేస్తున్న భారత్‌కు శుభారంభం లభించింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా బరిలో దిగాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. రోహిత్‌ బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 60 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. 
 
ఇక ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ 30 బంతుల్లోనే 3ఫోర్లు, 4సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిక్స్‌లు, ఫోర్లతో జోరందుకున్న హిట్‌మ్యాన్‌..శామ్‌ కరన్‌ వేసిన 8వ ఓవర్‌ ఆఖరి బంతిని సిక్స్‌ కొట్టి ఫిఫ్టీ మార్క్‌ చేరుకున్నాడు.
 
స్టోక్స్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4 బాదేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతిని రోహిత్‌ వికెట్ల మీదకు ఆడుకొని ఔటయ్యాడు. బ్యాట్‌కు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్లను తాకింది. 9 ఓవర్లకు భారత్‌ వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ(22) క్రీజులో ఉన్నాడు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments