Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిన అశ్విన్ : చెన్నై టెస్టులో సెంచరీ

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (17:02 IST)
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆర్.అశ్విన్ సెంచరీ చేశాడు. టీమిడియాకు చెందిన టాప్ ఆర్డర్ బౌలర్లంతా ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోలేక చతికిలపడుతుంటే రవిచంద్రన్ అశ్విన్ మాత్రం అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శిస్తూ సెంచరీ సాధించాడు. 
 
మొయిన్ అలీ బౌలింగ్లో ఫోర్ కొట్టి శతకం అందుకున్న అశ్విన్ భారత ఇన్నింగ్స్‌కు మరింత ఊపు తెచ్చాడు. టెస్టుల్లో అశ్విన్‌కు ఇది ఐదో సెంచరీ కాగా, ఒకే టెస్టులో 5 వికెట్లు, సెంచరీ సాధించడం అతడికిది మూడోసారి. హేమాహేమీ బ్యాట్స్‌మెన్‌కు సాధ్యం కాని రీతిలో ఎంతో క్లిష్టమైన స్పిన్ పిచ్‌పై పూర్తి సాధికారతతో ఆడిన అశ్విన్ తన కెరీర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పవచ్చు.
 
ఇక అశ్విన్ సెంచరీతో చెన్నై టెస్టులో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 286 పరుగులకు ఆలౌటైంది. తద్వారా ఇంగ్లండ్ ముందు 482 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 106 పరుగులు చేసిన అశ్విన్... ఇంగ్లండ్ పేసర్ ఒల్లీ స్టోన్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అంతకుముందు అశ్విన్ ప్రోత్సాహంతో సిరాజ్ (16 నాటౌట్) కూడా దూకుడుగా ఆడాడు. సిరాజ్ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. అశ్విన్ స్కోరులో 14 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
 
కాగా, ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసింది. అలాగే, ఇంగ్లండ్ జట్ట తన తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసింది. ఆ తర్వాత 482 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తన రెండో ఇన్నింగ్స్‌లో అపుడే మూడు వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ఇంకా రెండు రోజులు మిగిలివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments