Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి ఏకాగ్రత లేదు.. నెగటివ్ ఆలోచనలు ఏర్పడ్డాయి: మార్క్ వా

సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్ర

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (13:08 IST)
సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ రాణించలేకపోతోంది. ఇంగ్లండ్‌ను సునాయాసంగా మట్టికరిపించిన టీమిండియా.. కంగారూల చేతిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు. ఇందుకు కారణాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా చెప్పాడు. ఇందుకు కారణం ప్రపంచ స్థాయి ఆటగాడిగా పేరొందిన భారత స్టార్ క్రికెటర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకాగ్రత కోల్పోవడమేనని చెప్పారు. 
 
బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శనతో కేవలం 12 పరుగులకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లి అంపైర్‌ను రివ్యూ కోరడం.. అందులో కోహ్లి ఎల్‌బీడబ్ల్యూగా ప్రకటించడంతో కోహ్లి చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగాడు. అద్భుతమైన ఆటగాడిగా కోహ్లి ఎన్నో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి కూడా ఎల్‌డబ్లును అంచనా వేయలేకపోవడం తనను విస్మయానికి గురిచేసిందని అభిప్రాయపడ్డాడు. వరుస ఇన్నింగ్స్‌లలో విఫలం వస్తు ఉండటంతో కోహ్లిలో నెగటివ్ ఆలోచనలు ఏర్పడి ఏకాగ్రత కోల్పోవడానికి దారితీస్తుందని మార్క్ వా విమర్శించాడు.
 
అద్భుతాలు చేస్తాడనకుంటే విరాట్ పేలవ ప్రదర్శనతో అనవసర తప్పిదాలతో వికెట్ కోల్పోతూ వస్తున్నాడని మార్క్ వా ఎద్దేవా చేశాడు. జట్టుకు అండగా నిలబడాల్సిన సారథి మధ్యలోనే నిష్క్రమిస్తే.. టీమ్‌లోని మిగతా సభ్యులపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments