పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత్ మూడు టీ20 మ్యాచ్లను ఆడుతుంది. ఇందులోభాగంగా, మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారత్ ఓడిపోయింది. శుక్రవారం నాగ్పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం ఇరు జట్లూ సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్లో టీమిండియా తప్పక గెవాల్సిన నిర్బంధ పరిస్థితి ఏర్పడింది.
అలాగే, నేటి మ్యాచ్లో గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కంగారులు ఉన్నారు. దీంతో ఇరు జట్లూ హోరాహారీగా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్లు దృష్టిసారించారు.
ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్లో వికెట్ కీపర్గా జట్టులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ పెద్దగా రాణించలేక పోయాడు. దీంతో అతని స్థానంలో రిషభ్ పంత్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
అలాగే, బౌలింగ్ విభాగంలో రాణించని భువనేశ్వర్ కుమార్ను తొలగించి ఫిట్నెస్ సాధించిన జస్స్రీత్ బుమ్రాకు చోటుకల్పించే అవకాశం లోకపోలేదు. భారత జట్టులో ఈ రెండు మార్పులు మినహా మిగిలిన జట్టును యధావిధిగా దింపే అవకాశం ఉంది. మరోవైపు, ఆస్ట్రేలియా జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది.