Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చక్కగా కుక్కతో ఎంజాయ్... ధోనీ ఆడడా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (20:46 IST)
గెలవాల్సిన మ్యాచ్‌ని చెత్త ఫీల్డింగుతో చేజేతులా చేజార్చుకుని క్రికెట్ అభిమానులను ఉస్సూరుమనిపించిన టీమిండియా కుర్రాళ్లు ఐదవ వన్డే ఆడేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆదివార నాడు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ హైదరాబాద్, నాగ్‌పూర్‌లో గెలిచింది భారత జట్టు. దీనితో ఇరు జట్లు 2-2తో వున్నాయి. ఈ నేపధ్యంలో ఐదో వన్డేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. 
 
ఐదో వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలావుంటే ఢిల్లీ చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నేరుగా ఇంటికి వెళ్లి పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఆ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూసినవారు కొందరు వావ్ అని కామెంట్లు పెడుతుంటే మరికొందరు... ఐదే వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చూడండి... చక్కగా కుక్కతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మనం కూడా ఇలాగే వుండాలి. ఒత్తిడి, టెన్షన్ పడకూడదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే నాలుగో వన్డేలో వికెట్ కీపర్ గా వ్యవహరించిన పంత్... ఐదో వన్డేలో కూడా ఆడుతాడని అంటున్నారు. ఈ లెక్కన ధోనీ రిజర్వ్ బెంచిలోనే వుండి ఆట చూడాలన్నమాట. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments