Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠపోరులో టీమిండియా జయభేరి... 500వ విక్టరీ...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (21:59 IST)
నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఆటలో భారత్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. దీనితో ఆసీస్ ఆటగాళ్లు 49.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. 251 పరుగల లక్ష్య ఛేదనలో చతికిలపడ్డారు. దీనితో భారత్ విజయం సాధించింది. ఈ విజయం టీమిండియాకు 500వ విజయం. 
 
ఇకపోతే 251 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(38) , అరోన్ ఫించ్ (37) తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆట తీరును చూసినవారు ఇక భారత్ గెలుపు కష్టం అనుకున్నారు. ఈ దశలో కుల్దీప్ ఫించ్‌ను ఔట్ చేయడంతో ఒక్కసారి కుదుపు వచ్చింది. ఆ తర్వాత మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 
 
బూమ్రా కూడా విజృంభించడంతో ఆసీస్ బ్యాట్సమన్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఆ దశలో స్టోనిస్ వీరవిహారం చేయడంతో ఆసీస్ గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ రంగప్రవేశం చేయడంతో ఆసీస్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. మొదటి బంతికే స్టోనిస్ వికెట్ పడగొట్టడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన జాంబా కూడా రెండు బంతులకే ఔట్ అవడంతో భారత్ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments