Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్కంఠపోరులో టీమిండియా జయభేరి... 500వ విక్టరీ...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (21:59 IST)
నాగ్‌పూర్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఆటలో భారత్ ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబరిచారు. దీనితో ఆసీస్ ఆటగాళ్లు 49.3 ఓవర్లకే ఆలౌట్ అయ్యారు. 251 పరుగల లక్ష్య ఛేదనలో చతికిలపడ్డారు. దీనితో భారత్ విజయం సాధించింది. ఈ విజయం టీమిండియాకు 500వ విజయం. 
 
ఇకపోతే 251 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(38) , అరోన్ ఫించ్ (37) తొలి వికెట్‌కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆట తీరును చూసినవారు ఇక భారత్ గెలుపు కష్టం అనుకున్నారు. ఈ దశలో కుల్దీప్ ఫించ్‌ను ఔట్ చేయడంతో ఒక్కసారి కుదుపు వచ్చింది. ఆ తర్వాత మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 
 
బూమ్రా కూడా విజృంభించడంతో ఆసీస్ బ్యాట్సమన్లలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఆ దశలో స్టోనిస్ వీరవిహారం చేయడంతో ఆసీస్ గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ ఆఖరి ఓవర్లో విజయ్ శంకర్ రంగప్రవేశం చేయడంతో ఆసీస్ విజయావకాశాలు ఆవిరయ్యాయి. మొదటి బంతికే స్టోనిస్ వికెట్ పడగొట్టడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన జాంబా కూడా రెండు బంతులకే ఔట్ అవడంతో భారత్ విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments