Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:49 IST)
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో భారత్ నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని ఓపెనర్లిద్దరే ఛేదించారు. ఈ విజయంతో ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 10, శిఖర్ ధావన్ 74, రాహుల్ 47, కోహ్లీ 16, అయ్యర్ 4, పంత్ 28, జడేజా 25, ఠాకూర్ 13, షమి 10, కుల్దీప్ యాదవ్ 17 చొప్పున పరుగులు చేయగా అదనపు పరుగుల రూపంలో 11 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 110 (నాటౌట్), డేవిడ్ వార్నర్ 128 (నాటౌట్)లతో సెంచరీలు మోత మోగించారు. ఫలితంగా భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు నిస్తేజంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 17న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య

ఆటో డ్రైవర్లకు దసరా కానుక... వాపాప మిత్ర కింద రూ.15 వేలు ఆర్థిక సాయం

ఒకటో తేదీన వేతనాలు ఇవ్వమంటే అరెస్టు చేయించిన జగన్‌కు బాబుకు తేడా ఉంది....

హెచ్1బీ వీసాలపై ఆసక్తి చూపించని భారతీయ టెక్ కంపెనీలు

హిజ్రాలు ఇంటిపై దాడి చేస్తారని అవమానం భారంతో ఓ మహిళ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

తర్వాతి కథనం
Show comments