Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (10:49 IST)
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో భారత్ నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని ఓపెనర్లిద్దరే ఛేదించారు. ఈ విజయంతో ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 10, శిఖర్ ధావన్ 74, రాహుల్ 47, కోహ్లీ 16, అయ్యర్ 4, పంత్ 28, జడేజా 25, ఠాకూర్ 13, షమి 10, కుల్దీప్ యాదవ్ 17 చొప్పున పరుగులు చేయగా అదనపు పరుగుల రూపంలో 11 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 110 (నాటౌట్), డేవిడ్ వార్నర్ 128 (నాటౌట్)లతో సెంచరీలు మోత మోగించారు. ఫలితంగా భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు నిస్తేజంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 17న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments