Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌కు ఐసోలేషన్ పూర్తి.. మరోమారు కోవిడ్ పరీక్షలు

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (12:07 IST)
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉండగా, ఈ కాలపరిమితి ముగిసింది. అయితే, ఆయనకు మరోమారు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు. 
 
ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచ వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్ పోటీ తర్వాత మూడు వారాలు బ్రేక్ దొరికింది. ఆ తర్వాత బయో బ‌బుల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన పంత్‌కు ఈ నెల 8వ తేదీన క‌రోనా వైరస్ సోకింది. 
 
నిబంధనల ప్రకారం 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకున్నప్పటికి పంత్ కి కరోనా పరీక్షల్లో నెగటివ్ తేలాల్సి ఉంది. ఆయనకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పంత్‌కు నెగటివ్‌గా తేలితే అప్పుడు టీమ్‌తో పాటు బయోబబుల్‌లో చేరతాడు. 
 
ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్న పంత్ త్వరలోనే జట్టులో చేరే అవకాశం ఉంది. అయితే, ప్రాక్టీస్ మ్యాచ్ సమయానికి పంత్ ఐసోలేషన్ పూర్తిచేసుకున్నప్పటికీ అతడి మరింత విశ్రాంతి అవసరమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments