Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:49 IST)
ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదనలో ఆదిలో కొంచెం తడబడింది. ఆ తర్వాత కార్తీక్, కృనాల్‌లు రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలిచింది. 
 
ఇక ఈ మ్యాచ్ గెలుపోటములు అటుంచితే… విండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే… ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో కరేబియన్ ఆటగాళ్లు హెట్‌మైర్‌, హోప్ తడబడి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నారు. హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు.
 
ఈ రనౌట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యూట్ ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ, ఎందుకు ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రేస్, హెట్‌మైర్‌ విన్ ది రేస్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments