Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోంది : సునీల్ గవాస్కర్

భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక పర్యటనతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారంట

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (12:24 IST)
భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంక పర్యటనతో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లలో టీమిండియా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారంటూ కొనియాడారు. 
 
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు 5-0తోనూ, స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ, ప్రపంచంలో అత్యుత్తుమ టాప్ ఆర్డర్ భార‌త జ‌ట్టు సొంతం అని సునీల్‌ కొనియాడారు.
 
ముఖ్యంగా శిఖర్ ధవన్‌ - రోహిత్ శర్మ‌, రహానే - రోహిత్‌ శర్మల ఓపెనింగ్‌ జోడీతో పాటు, వన్‌డౌన్‌లో వచ్చే కోహ్లీపైనా ఆయ‌న పొగ‌డ్త‌ల‌ జల్లు కురిపించారు. ఈ టాప్‌-3 బ్యాట్స్‌మెన్లను చూసి ప్రపంచం ఈర్ష్య పడుతోందన్నారు. ఈ ముగ్గురూ చాలా సార్లు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశార‌ని, దీంతో వారి త‌ర్వాత నాలుగో స్థానంలో వచ్చే వారికి 30 నుంచి 40 ఓవర్ల మధ్య బ్యాటింగ్‌ దక్కుతోంద‌ని గ‌వాస్క‌ర్‌ అన్నారు.
 
నాగ్‌పూర్‌లో జ‌రిగిన వన్డేలో కోహ్లీ 55 బంతుల్లో 39 పరుగులు చేయడంపై స్పందిస్తూ, నాగ్‌పూర్‌లాంటి పిచ్ మీద బ్యాటింగ్ చేయ‌డం అంత సులభమేం కాద‌ని, అది ఇండోర్‌ లేదా బెంగళూరు పిచ్‌ల మాదిరిగా ఉండ‌క‌పోవ‌డంతో కోహ్లీ కొంత ఇబ్బంది పడ్డాడన్నారు. మొత్తంమీద శ్రీలంకతోపాటు స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లలో భారత క్రికెటర్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పొరిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తర్వాతి కథనం
Show comments