Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ మృతి.. గదిలో విగతజీవిగా..

భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (17:13 IST)
భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో భారత్ అండర్-19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ విగతజీవిగా కనిపించాడు. ట్రైనర్ సావంత్ (40) రిపోర్ట్ చేయవలసి ఉంది. భారత్ అండర్ 19 జట్టు ట్రైనర్ రాజేష్ సావంత్ ముంబైలోని ఓ లాడ్జి గదిలో ఆదివారం ఉదయం శవమై కనిపించాడు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల బీసీసీఐ తరపున సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి సంతాపం వ్యక్తం చేశారు. 
 
రాజేష్ సావంత్ కనిపించకపోయేసరికి వెతకగా.. తన రూమ్‌లో నిర్జీవంగా పడి ఉండటాన్ని గుర్తించారు. ఆయన గుండెపోటుతో మరణించారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. పోలీసులు మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
భారత్ అండర్ 19 జట్టు ఇంగ్లండ్‌తో ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడవలసి ఉంది. తొలి మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరగాలి. చివరి మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో ఫిబ్రవరి 8న జరుగుతుంది. సావంత్ ఆఫ్ఘనిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టు, భారత్ ఏ జట్టు ట్రైనర్‌గా కూడా పని చేశారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments