Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ గడ్డపై ఘోర వైఫల్యం.. రవిశాస్త్రి, కోహ్లీలపై కన్నేసిన బీసీసీఐ

ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ,కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (11:25 IST)
ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ, కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ్నించనుంది.తుది జట్టును ఎంపిక చేయడంలో విరాట్, రవిశాస్త్రి కలిసి తీసుకున్న నిర్ణయాలపై బోర్డ్ ఆరా తీయనుంది. జట్టు సెలక్షన్‌తో పాటు తుది జట్టు ఎంపికలో రవిశాస్త్రి, విరాట్ కొహ్లీలకు బీసిసిఐ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 
 
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీసిసిఐ విరాట్, రవిశాస్త్రిల సలహాలను పరిగణలోకి తీసుకుని పటిష్టమైన జట్టునే ఎంపిక చేసింది. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా టీ20, వన్డే సిరీస్‌లతో పాటు వామప్ మ్యాచ్‌లు సైతం ఏర్పాటు చేసింది. టీ20 సిరీస్ నెగ్గి, వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల్లో తేలిపోయింది. 
 
ప్రస్తుత టెస్ట్‌ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు జట్టులో మార్పులు చేసిన భారత్ పెద్ద మూల్యాన్నే చెల్లించింది. అందుకే కెప్టెన్ విరాట్, రవిశాస్త్రిల నిర్ణయాలపై బీసిసిఐ నిఘా పెట్టింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం తొలి 3 టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ఎంపిక చేసిన బీసిసిఐ ఆఖరి రెండు టెస్ట్‌లకు జట్టును ప్రకటించాల్సి ఉంది. విరాట్, రవిశాస్త్రిలను సంప్రదించిన తర్వాతే చివరి రెండు టెస్ట్‌లకు జట్టును ఎంపిక చేయనుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments