Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ గడ్డపై ఘోర వైఫల్యం.. రవిశాస్త్రి, కోహ్లీలపై కన్నేసిన బీసీసీఐ

ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ,కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (11:25 IST)
ఇంగ్లండ్ గడ్డపై భారత్ పరాజయం పాలవడంపై భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) సీరియస్‌గా తీసుకుంది. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యంపై.. కెప్టెన్ విరాట్ కొహ్లీ, కోచ్ రవిశాస్త్రిలను బీసిసిఐ ప్రశ్నించనుంది.తుది జట్టును ఎంపిక చేయడంలో విరాట్, రవిశాస్త్రి కలిసి తీసుకున్న నిర్ణయాలపై బోర్డ్ ఆరా తీయనుంది. జట్టు సెలక్షన్‌తో పాటు తుది జట్టు ఎంపికలో రవిశాస్త్రి, విరాట్ కొహ్లీలకు బీసిసిఐ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 
 
ఇంగ్లండ్‌తో సిరీస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీసిసిఐ విరాట్, రవిశాస్త్రిల సలహాలను పరిగణలోకి తీసుకుని పటిష్టమైన జట్టునే ఎంపిక చేసింది. టెస్ట్ సిరీస్‌కు సన్నాహకంగా టీ20, వన్డే సిరీస్‌లతో పాటు వామప్ మ్యాచ్‌లు సైతం ఏర్పాటు చేసింది. టీ20 సిరీస్ నెగ్గి, వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల్లో తేలిపోయింది. 
 
ప్రస్తుత టెస్ట్‌ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లకు జట్టులో మార్పులు చేసిన భారత్ పెద్ద మూల్యాన్నే చెల్లించింది. అందుకే కెప్టెన్ విరాట్, రవిశాస్త్రిల నిర్ణయాలపై బీసిసిఐ నిఘా పెట్టింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం తొలి 3 టెస్ట్‌లకు మాత్రమే భారత జట్టును ఎంపిక చేసిన బీసిసిఐ ఆఖరి రెండు టెస్ట్‌లకు జట్టును ప్రకటించాల్సి ఉంది. విరాట్, రవిశాస్త్రిలను సంప్రదించిన తర్వాతే చివరి రెండు టెస్ట్‌లకు జట్టును ఎంపిక చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments