Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా జట్టుకు షాకిచ్చిన భారత్ ఏ జట్టు.. 8 వికెట్ల తేడాతో విజయం

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2015 (15:48 IST)
భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. సిరీస్ ప్రారంభానికి ముందు మంగళవారం జరిగిన ఏకైక ట్వంటీ-20 వామప్ మ్యాచ్‌లో సఫారీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. భారత్ ఏ జట్టు సఫారీలను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించారు.
 
 
ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డీ విల్లియర్స్ 37, ప్లెసిస్ 42, డుమ్నీ 68 (నాటౌట్), మిల్లర్ 10, బెహర్డైన్ 17 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, అదనపు పరుగుల రూపంలో 13 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 190 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో రెండు బంతులు మిగిలివుండగానే రెండు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత ఏ జట్టు ఓపెనర్లు వోహ్రా 56, అగర్వాల్ 87, శాంమ్సన్ 31 (నాటౌట్), మన్‌దీప్ సింగ్ 12 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో ఏడు పరుగులు వచ్చాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments