Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకపై 82 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (08:21 IST)
Team India
మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
 
ఈ నేపథ్యంలో బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, టీమిండియా రన్‌రేట్‌ (0.560) కూడా పెరిగింది. 
 
దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. 
 
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన శ్రీలంక ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 82 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
భారత మహిళా బౌలర్ల విషయానికొస్తే.. అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. ఇక శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్​ వికెట్ పడగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం ఓ పుత్రుడిని కోల్పోయింది : ముఖేశ్ అంబానీ ఎమోషనల్ పోస్ట్

"100 కొట్టు మేకను పట్టు" దసరా సందర్భంగా వినూత్న లక్కీ డ్రా

సిమి గరేవాల్‌తో కలిసి బీచ్‌లో రొమాంటిక్ వాక్.. రతన్ టాటా హ్యాపీ (video)

రతన్ టాటా మృతి పట్ల జగన్, తెలుగు సీఎంల సంతాపం

రతన్ టాటా పారిశ్రామికవేత్తనే కాదు... గొప్ప మానవతావాది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపిన గొప్ప దర్శనికుడు : రజనీకాంత్

రతన్ టాటా డేటింగ్ చేసిన బాలీవుడ్ నటి ఎవరు?

ఆసక్తిగా రజనీ హంటర్.. ఫస్ట్ ఆఫ్ రివ్యూ

భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు- చిరంజీవి

రతన్ టాటా మృతిపై ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్...

తర్వాతి కథనం
Show comments