Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో తొలి వన్డే: 67 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (22:44 IST)
శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటనలో ఉందన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో షనక నేతృత్వంలోని శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 373 పరుగులు చేసి శ్రీలంకకు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (113) సెంచరీ సాధించగా, కెప్టెన్ రోహిత్ శర్మ 83, శుభ్ మాన్ గిల్ 70 పరుగులు చేశారు. 
 
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.  
 
శ్రీలంక ఆటగాళ్లలో నిశాంక 72, అసలంగ 23, సిల్వా 47, షనక 102, హజరంగ 16 పరుగులు సాధించారు. భారత జట్టు తరఫున స్యామీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ తీశారు. సిరాజ్ 2 వికెట్లు, మాలిక్ 3 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 12న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments