Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌‍కోట్ వన్డేలో భారత్ గెలుపు... 2-1 తేడాతో సిరీస్ వశం

Webdunia
ఆదివారం, 8 జనవరి 2023 (10:38 IST)
పర్యాటక శ్రీలంక జట్టుతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 91 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో 2-1 తేడాతో గెలుపొందింది. 
 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. మిస్టర్ 360గా పేరుగాంచిన బ్యాటర్ సూర్యకుమార్ తనదైనశైలిలో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 51 బంతుల్లో 112 పరుగులు చేశారు. ఫలితంగా 20 ఓవర్లలో 228 పరుగులుచేసింది. 
 
ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో షనక 23, ఓపెనర్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, అసలంక 19 పరుగులు చేశాడు. రెండో టీ20లో ఐదు నోబాల్స్ వేసి విలన్‌గా మారిన అర్షదీప్ సింగ్ మూడో టీ20లో 3 వికెట్లు లంక వెన్ను విరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, ఉమ్రామన్ మాలిక్ 2, చహల్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ చొప్పున తీశాడు. 
 
ఈ మ్యాచ్‌ విజయంతో మూడు టీ20ల సిరీస్‌‍లను టీమిండియా 2-1 కేవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా ఈ నెల 10వ తేదీన గౌహతి వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments