Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణే టెస్ట్ మ్యాచ్ : న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ఆలౌట్

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (17:02 IST)
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను అశ్విన్ పడగొట్టగా, మిగిలిన ఏడు వికెట్లను వరుసగా సుందర్ ఖాతాలోకి చేరాయి. సుందర్ ఆఫ్ స్పిన్‌ను ఆడేందుకు కవీస్ ఆటగాళ్ళు ముప్పుతిప్పలు పడ్డారు. ఫలితంగా కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పిచ్‌ స్పిన్‌కు పూర్తిగా అనుకూలించడంతో ఏ దశలోనూ కివీస్ ఆటగాళ్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేకపపోయారు. కివీస్ జట్టులో డివాన్స్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులతో రాణించారు. 
 
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, రోహిత్ శ్రమ డకౌట్ అయ్యాడు. మొత్తం 9 పరుగులు ఎదుర్కొన్న రోహిత్.. పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ 6, గిల్ (0) పరుగులుతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇది వైసీపీ కాదు.. కూట‌మి ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌ : అధికారులకు డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌

చిక్కుల్లో కేటీఆర్ బావమరిది ... పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల

చంద్రబాబు వదిలిన విషపు బాణమే షర్మిల : భూమన కరుణాకర్ రెడ్డి

స్వరూపానందేంద్ర సరస్వతి ఎవరు? శారదాపీఠానికి భూముల కేటాయింపును ఏపీ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది?

అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగించే వ్యక్తి : తులసిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బింగ్ ప్రారంభించిన వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం

హ‌నుమంతుని నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న ర‌ణ‌మండ‌ల‌

సవాల్‌గా తీసుకుని అమ్మ స్ఫూర్తితో పాత్రలో నటించాను: మీనాక్షి చౌదరి

మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ ఇయర్‌గా 2024

విశాఖలో నాన్నగారి షూటింగ్ రోజులు గుర్తుచేసుకుంటూ డాన్స్ చేసిన సూర్య

తర్వాతి కథనం
Show comments