Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణే టెస్ట్ మ్యాచ్ : న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 ఆలౌట్

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (17:02 IST)
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక కివీస్ జట్టు 259 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి మూడు వికెట్లను అశ్విన్ పడగొట్టగా, మిగిలిన ఏడు వికెట్లను వరుసగా సుందర్ ఖాతాలోకి చేరాయి. సుందర్ ఆఫ్ స్పిన్‌ను ఆడేందుకు కవీస్ ఆటగాళ్ళు ముప్పుతిప్పలు పడ్డారు. ఫలితంగా కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఈ టెస్టులో తొలుత టాస్ గెలిచి కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పిచ్‌ స్పిన్‌కు పూర్తిగా అనుకూలించడంతో ఏ దశలోనూ కివీస్ ఆటగాళ్లు కుదురుగా బ్యాటింగ్ చేయలేకపపోయారు. కివీస్ జట్టులో డివాన్స్ కాన్వే 76, రచిన్ రవీంద్ర 65 పరుగులతో రాణించారు. 
 
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, రోహిత్ శ్రమ డకౌట్ అయ్యాడు. మొత్తం 9 పరుగులు ఎదుర్కొన్న రోహిత్.. పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. కాగా, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ జైస్వాల్ 6, గిల్ (0) పరుగులుతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ట్రంప్‌కు నిక్కీ హేలీ వార్నింగ్

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments