Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ : సెంచరీ చేసిన రోహిత్ శర్మ... అర్థ సెంచరీతో జడేజా...

ఠాగూర్
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (15:23 IST)
రాజ్‌కోట్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించాడు. మూడో టెస్టులో తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జైశ్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ... ముచ్చటైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 157 బంతుల్లో సెంచరీ కొట్టాడు. తన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 
 
మరోవైపు, రోహిత్ శర్మకు అండగా మరో ఎండ్‌లో జడేజా కూడా నిలకడైన ఆటతీరుతో రాణించి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత శర్మ 129, జడేజా 83 పరుగులతో మైదానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మిగిలిన ఆటగాళ్లలో జైశ్వాల్ 10, శుభమన్ గిల్ డకౌట్ కాగా, రాజాత్ పటీదార్ 5 చొప్పున పరుగులు చేశఆరు. ఇంగ్లండ్ బౌలర్లలో ఉడ్ రెండు వికెట్లు పడగొట్టగా, హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

హనీ ట్రాప్‌లో పోలీసులు.. ఇష్టపడుతున్నానని కౌగిలించుకుంది.. ఆ తర్వాత ఏమైందంటే?

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments