Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాంచెష్టర్‌లో వర్షం పడాలని కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

మాంచెష్టర్‌లో వర్షం పడాలని కోరుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:24 IST)
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, మంగళవారం మాంచెష్టర్ వేదికగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం అటు కోహ్లీ సేన, ఇటు కివీస్ జట్లు సమాయత్తమయ్యాయి. 
 
అయితే, ఈ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగే మాంచెష్టర్‌లో మంగళవారం వర్షంపడే అవకాశాలు ఉన్నట్టు బ్రిటన్ వాతావరణ శాఖ చెపుతోంది. మంగళవారం నాటి మ్యాచ్‌కు తేలికపాటి జల్లులు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
అయితే రేపు జరిగేది సెమీ ఫైనల్ కనుక దానికి ఎలాగూ బుధవారం రిజర్వ్ డే ఉంది. ఈ క్రమంలో రేపు వర్షం కారణంగా ఆటను కొనసాగించలేకపోతే.. బుధవారం రోజున అక్కడి నుంచే ఆటను ప్రారంభిస్తారు. అయితే రేపటి కన్నా బుధవారమే ఇంకా ఎక్కువ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 
 
ఈ క్రమంలో వరుసగా రెండు రోజులూ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏమిటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ రెండు రోజులూ వర్షం కారణంగా ఆట జరగకపోతే అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదు. అది టీమిండియాకే లాభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
అదెలాగంటే.. వర్షం వల్ల రెండు రోజులూ ఆట జరగకుండా మ్యాచ్ రద్దయితే.. లీగ్ దశలో అధిక పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఈ లెక్కన చూస్తే.. భారత్, న్యూజిలాండ్ జట్లలో భారత్‌కు అధిక పాయింట్లు (15) ఉన్నాయి కనుక.. టీమిండియానే ఫైనల్‌కు వెళ్తుంది. 
 
అయితే సెమీ ఫైనల్ మ్యాచ్ టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ద్వారా విన్నర్‌ను నిర్ణయిస్తారు. అందుకే భారత క్రికెటర్లు మాత్రం వర్షం పడాలని కోరుకుంటున్నారు. కాగా, లీగ్ దశలో న్యూజిలాండ్- భారత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా రద్దు అయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో మారిపోవచ్చు.. తర్వాత మీ కథ ఉంటుంది : వైఎస్ జగన్

నారా లోకేష్ సంచలనాత్మక నిర్ణయం.. ఒకే పుస్తకం.. ఒక నోట్ బుక్.. పుస్తకాల బరువు?

Conductor: ఛార్జీల వివాదం-రిటైర్డ్ ఐఏఎస్‌పై కండెక్టర్ దాడి.. (video)

Kerala: టీనేజ్ అథ్లెట్‌పై కోచ్‌, క్లాస్‌మేట్ల అత్యాచారం.. దాదాపు ఐదేళ్లలో 60మంది?

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ మందా జగన్నాథం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ కథ మధ్యలో ఛేంజ్ చేశారా? జనవరి 10న కలిసిరాలేదా?

నాగబంధం నుంచి రుద్రగా విరాట్ కర్ణ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి

డాకు మహారాజ్ తో సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన శ్రద్దా శ్రీనాథ్

డాకు మహారాజ్ సీక్వెల్ తీస్తా : డైరెక్టర్ బాబీ

NBK happy - ఆనంద వేడుకల్లో డాకు మహారాజ్ - USAలో $1M+ గ్రాస్‌ని దాటింది

తర్వాతి కథనం
Show comments