Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒత్తిడికి భయపడ్డాం... అందుకే కప్ చేజారింది : మిథాలీ రాజ్

మహిళల ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్ పోటీలో భారత్ మహిళ క్రికెట్ జట్టు తృటిలో కప్‌ను చేజార్చుకుంది. విజయం అంచులవరకు వచ్చిన భారత జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Webdunia
సోమవారం, 24 జులై 2017 (14:21 IST)
మహిళల ప్రపంచ క్రికెట్ కప్ టోర్నీ ఫైనల్ పోటీలో భారత్ మహిళ క్రికెట్ జట్టు తృటిలో కప్‌ను చేజార్చుకుంది. విజయం అంచులవరకు వచ్చిన భారత జట్టు కేవలం 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీనిపై కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందిస్తూ... 28 ప‌రుగుల తేడాలో చివ‌రి 7 వికెట్ల‌ను కోల్పోయి.. చేతిలోకి వ‌చ్చింద‌నుకున్న ట్రోఫీని ఇంగ్లండ్ చేతిలో పెట్టేశారు. అయినా త‌మ టీమ్‌ను చూసి ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. 
 
ఇంగ్లండ్ కూడా అంత తేలిగ్గా గెల‌వ‌లేదనీ, అయితే వాళ్లు ఒత్తిడిని జ‌యించారని చెప్పుకొచ్చింది. మ్యాచ్ ఒక ద‌శ‌లో రెండు జట్లకు స‌మాన అవ‌కాశాలు క‌ల్పించింది. కానీ మేం భ‌య‌ప‌డ్డాం. అదే మా ఓట‌మికి దారి తీసింది అని మిథాలీ అభిప్రాయపడింది. మా జ‌ట్టు స‌భ్యుల‌ను చూస్తే గ‌ర్వంగా ఉంది. 
 
ప్ర‌త్య‌ర్థుల‌కు ఒక్క మ్యాచ్ కూడా సునాయాసంగా ఇవ్వ‌లేదు. ఈ టోర్నీలో బాగా ఆడాము. టీమ్‌లోని యంగ్‌స్ట‌ర్స్ అద్భుతంగా రాణించారు అని మిథాలీ చెప్పింది. ఇక త‌న భ‌విష్య‌త్తుపై స్పందిస్తూ.. మ‌రో రెండేళ్లు టీమ్‌లోనే ఉంటాన‌ని, అయితే వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్ మాత్రం ఆడ‌న‌ని ఆమె తేల్చి చెప్పింది.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments