ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఆంథమ్‌ ఆవిష్కరణ

ఠాగూర్
శనివారం, 4 మే 2024 (13:48 IST)
జూన్ నెల ప్రారంభంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇటీవల ఆయా దేశాలు తమ ప్రపంచకప్ జట్లను ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా పొట్టికప్ సంబరాలు షురూ అయ్యాయి. అయితే, ఐసీసీ టీ20 వరల్డ్ కఫ్ ఆంథమ్‌ను తాజాగా విడుదల చేసింది. గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ టీ20 ప్రపంచకప్ అధికారిక గీతం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్'ను రూపొందించారు. ఇక ఈ ఆంథమ్ విడుదలతో వరల్డ్ కప్ వేడుకలు మొదలైపోయాయి.
 
మ్యూజిక్ వీడియోలో బోల్ట్, గేల్ సందడి వరల్డ్ కప్ ఆంథమ్ వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత ఉసేన్ బోల్ట్, విండీస్ స్టార్ క్రికెటర్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు కనిపించారు. మ్యూజిక్ వీడియోలో వాళ్లంతా క్రికెట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు వెళ్లినప్పుడు కలిగే వినోదం, ఉత్సాహాన్ని వీడియో చూపిస్తుంది. 
 
ఇక జూన్ 2 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టోర్నీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈసారి 20 జట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్రపంచ కప్‌లో మొత్తం 55 మ్యాచులు జరగనున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్ ఆడనుంది. 
 
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : అమెరికా జట్టులో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు!! 
 
జూన్ నెలలో మరో ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నీ జరుగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. తాజాగా ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా కూడా 15 మంది ఆటగాళ్ళతో జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో భారత సంతతికి చెందిన ఆటగాళ్లే సగం మంది ఉన్నారు. 
 
కెప్టెన్ మోనాంక్ పటేల్‌తో పాటు సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్‌కు ప్రపంచకప్ స్క్వాడ్‌లో చోటుదక్కింది. అలాగే న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ కోరే అండర్సన్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. అండర్సన్ కివీస్ తరపున 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఆడిన విషయం తెలిసిందే. మిగిలిన ప్లేయర్లలో ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఎస్ టేలర్, జెస్సీ సింగ్, కెంజిగే, షాల్క్ విక్, ఆండ్రీస్ గౌస్, జహంగీర్, అలీఖాన్, నితీశ్ కుమార్‌లు ఉన్నారు. రిజర్వ్ ఆటగాళ్లుగా గజానంద్, డ్రైసేల్, యాసిర్ చోటుకల్పించింది. 
 
కాగా, యూఎస్ క్రికెట్ జట్టు డల్లాస్‌లో కెనడాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 6వ తేదీన పాకిస్థాన్‍తో, జూన్ 12న భారత్‌తో తలపడనుంది. అలాగే ఈ టోర్నీలో తన చివరి మ్యాచ్‌ను జూన్ 14న ఫ్లోరిడాలో ఐర్లాండ్ ఆడనుంది. ఇదిలావుంటే.. ఈసారి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరగనుంది.
 
2024 ఐసీసీ టీ20 కోసం అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరీ ఆండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, నోష్టుష్ కేంజిగే, సౌరభ్ నేత్రల్వాకర్, షాడ్లీ వాన్ షాలివిక్, స్టీవెన్ టేలర్, షాయ జహంగీర్, రిజర్వ్ ఆటగాళ్లు. జువానో డ్రైసేల్, గజానంద్ సింగ్, యాసిర్ మహ్మద్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తర్వాతి కథనం
Show comments