Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ కప్: నాలుగు వికెట్లను కోల్పోయిన విండీస్..!

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (12:56 IST)
ప్రపెంచ కప్‌ పోటీలలో భాగంగా గ్రూప్‌ బీలో భారత్‌తో జరుగుతున్న వన్డేలో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 15 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 54 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు తొలుత దూకుడును ప్రదర్శించింది. తొలి ఓవర్‌లోనే ఐదు పరుగులు సాధించింది. 
 
ఆహా అనుకోగానే ఎనిమిది పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ లో భారత స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ విసిరిన బంతికి డ్వేన్ స్మిత్ ఔట్ అయ్యాడు. 20 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
ఆ తర్వాత 15 పరుగుల వద్ద విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 7వ ఓవర్‌లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌‌లో గేల్స్ మిడ్ ఆన్ మీదుగా ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని తొలిత పట్టులోలేక పోయినా, తర్వాత దానిని మోహిత్ శర్మ  విసరడం, విరాట్ కోహ్లీ ఈ బాల్ అందుకుని వికెట్లను గిరటేయడంతో... శామ్యూల్స్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత బరిలో దికిన శామ్యుల్స్ రెండు పరుగులకు ఔట్ కాగా,  తర్వాత క్రీజ్‌పైకి వచ్చిన రామ్దీన్ పరుగుల ఏమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టారు. దీంతో వెస్టిండీస్ జట్టు 15 ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి 54 పరుగులు చేసింది.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments