Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తాం : ఇంజమామ్ ప్రగల్భాలు

చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హక్ ప్రగల్భాలు పలికాడు. నిజానికి ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క అంతర్జాతీయ పోటీల్లోనూ భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ నెగ్గిన చ

Webdunia
శనివారం, 20 మే 2017 (09:21 IST)
చాంపియన్స్ ట్రోఫీ భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హక్ ప్రగల్భాలు పలికాడు. నిజానికి ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క అంతర్జాతీయ పోటీల్లోనూ భారత్‌పై దాయాది దేశం పాకిస్థాన్ నెగ్గిన చరిత్రే లేదు. కానీ, ఈ దఫా ఇంగ్లండ్ వేదికగా జరిగే చాంపియన్ ట్రోఫీలో మాత్రం భారత్‌ను చిత్తుగా ఓడిస్తామని ఇంజమామ్ అంటున్నాడు. 
 
కాగా, చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా వచ్చే నెల నాలుగో తేదీన దాయాది దేశాలు భారత్-పాక్‌లు మళ్లీ తలపడబోతున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఎడ్జ్‌బాస్టన్‌ వేదిక కాబోతోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించడమే కాకుండా ఏకంగా ట్రోఫీనే ఎగరేసుకుపోతామని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్. ప్రస్తుతం ఆయన పాక్ జాతీయ జట్టుకు సెలక్టర్‌గా ఉన్నాడు. 
 
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై హక్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను ఓడించడానికి మాత్రమే ఇంగ్లండ్ వెళ్లడం లేదని, కప్పు కూడా కొట్టుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 2004లో ఇంజీ సారథ్యంలోని పాక్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇప్పుడు అదే వేదికపై భారత్-పాక్‌లు తలపడనుండడంతో పాక్ మరోసారి విజయం సాధింస్తుందని హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments