Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ బయోపిక్: సాక్షి పాత్రలో నటించనున్న కొత్త భామ కియారా అద్వానీ!

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2015 (09:30 IST)
టీమిండియా వన్డే, ట్వంటీ 20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ సినిమా తెరకెక్కనుంది. ‘ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ’ పేరిట బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నీరజ్ పాండే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
ఈ నెలాఖరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ధోనీ పాత్రకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (పీకే ఫేం) ఎంపిక కాగా, ధోనీ భార్య సాక్షి పాత్రకు ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొత్త భామ కియారా అద్వానీ సెలెక్ట్ అయింది. సాక్షి పాత్రకు చాలా మంది హీరోయిన్లను పరిశీలించామని చెప్పిన నీరజ్, కియారా అయితేనే సరిపోతుందనిపించిందని పేర్కొన్నారు. 
 
ఈ సందర్భంగా కియారా మాట్లాడుతూ.. సాక్షి, ధోనీలను ఇంకా కలవలేదని.. తన రోల్‌కు న్యాయం చేసే దిశగా తీవ్రంగా కృషి చేస్తానని, సాక్షి పాత్రలో మెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. సాక్షి క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకుని ఈ రోల్ చేస్తానని చెప్పింది. ఇక ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని కియా అద్వానీ వెల్లడించింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments