Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ లయన్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ ఓటమి: శతకం చేసినా వృధా.. కోహ్లీ హార్ట్ బ్రోకెన్

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2016 (14:58 IST)
ఆదివారం గుజరాత్ లయన్స్ చేతిలో పరాజయం పాలవడాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోవడం ఎంతో బాధను మిగిల్చిందన్నాడు. ఇంకా ఐపీఎల్‌లో తొలి శతకాన్ని నమోదు చేసుకోవడం కూడా సంతోషాన్నివ్వలేదని తెలిపాడు. 
 
జట్టు స్కోరు 170 కావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఏ దశలోనూ సెంచరీ గురించి ఆలోచించట్లేదని చెప్పుకొచ్చారు. కానీ జట్టు ఓడిపోవడం గురించి ఆలోచించనే లేదని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోహ్లీ (100 నాటౌట్‌; 63 బంతుల్లో 11×4, 1×6) కెరీర్‌లో తొలి టీ20 సెంచరీ చేసినా అది వృధా అయిన సంగతి తెలిసిందే. 
 
గుజరాత్‌ లయన్స్‌ 6 వికెట్ల తేడాతో బెంగళూరును ఓడించింది. విరాట్‌ కోహ్లీ శతకంతో అదరగొట్టినా గుజరాత్‌ లయన్స్‌ చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. కోహ్లి సెంచరీ సాయంతో 20 ఓవర్లలో 180/2 స్కోరు చేసింది. కాగా, దినేశ్‌ కార్తీక్‌ (50 నాటౌట్‌; 39 బంతుల్లో 3×4) సమయోచిత ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments