Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి డేవిడ్ లాయిడ్ వార్నింగ్.. పసుపు, ఎర్ర కార్డులు ఇవ్వాలి.. లేకుంటే..?

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (11:01 IST)
టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఇంగ్లీష్ జట్టు మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ హెచ్చరించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ల సందర్భంగా టీమ్‌ఇండియా సారథి అంపైర్లకు గౌరవం ఇవ్వట్లేదని చెప్పాడు. డీఆర్‌ఎస్‌ విషయాల్లో ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొన్నాడు. అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని లాయిడ్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఇలా చేస్తే కోహ్లీ రెడ్ కార్డుతో మైదానం వీడే ఛాన్సు కూడా వస్తుందని హెచ్చరించాడు. 
 
కోహ్లీ ఇటు అంపైర్లు, అటు ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ వాగ్వాదాలకు దిగుతున్నాడని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని డేవిడ్‌ లాయిడ్‌ మండిపడ్డాడు. తాజాగా మంగళవారం జరిగిన తొలి వన్డేలోనూ (బట్లర్‌తో వాగ్వాదం) అలాంటిదే జరిగింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగకూడదు. నోరు లేని ఐసీసీ కూడా ఏం చేయలేకపోయింది' అని లాయిడ్‌ తీవ్రంగా స్పందించాడు. 
 
అలాగే విరాట్‌ కోహ్లీ ఇప్పుడున్న హోదాలో.. తను ఏం మాట్లాడినా, ఏం చేసినా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై అంపైర్లు తగిన చర్యలు తీసుకునేలా.. పసుపుపచ్చ, ఎర్ర రంగు కార్డులు అందజేయాలి. ఎందుకంటే అంపైర్లు ఇప్పుడు ఏ చర్య తీసుకునేలా కనిపించడంలేదు' అని ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు పేర్కొన్నాడు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments