Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఎలా ఆడతాడో చూస్తాడట ఈ బౌలర్

పుణేలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీకంటే వేగంగా వీరబాదుడుతో తమకు చుక్కలు చూపెట్టిన మరో భారత బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌ను కూడా పక్కనబెట్టిన ఇంగ్లండ్ జట్టు రెండో వన్డేలో కోహ్లీకి చెక్ పెడతామని తేల్చి చెబుత

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (04:09 IST)
భారత్‌తో తొలి వన్డేలో ఘోర పరాజయం పొందిన ఇంగ్లండ్ జట్టుకు కల్లో కూడా కోహ్లీ గుర్తుకొస్తున్నట్లున్నాడు. పుణేలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీకంటే వేగంగా వీరబాదుడుతో తమకు చుక్కలు చూపెట్టిన మరో భారత బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్‌ను కూడా పక్కనబెట్టిన ఇంగ్లండ్ జట్టు రెండో వన్డేలో కోహ్లీకి చెక్ పెడతామని తేల్చి చెబుతోంది. కారణం తెలిసిందే. కోహ్లీ ఒక్కడు నిలబడితే చాలు జట్టు జట్టంతా అతడికి తోడై నిలిచి ఆడుతుందనేది రుజువైపోయింది. 
 
తొలివన్డేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  హీరో కేదార్‌ జాదవ్‌ (76 బంతుల్లో 120; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (105 బంతుల్లో 122; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్బుత శతకాలతో భారత్ అసాధారణ రీతిలో ఇంగ్లండ్‌పై విజయాన్ని సాధించింది. అయితే రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మన్లకు అలాంటి అవకాశం ఇవ్వనని ఇంగ్లండ్ పేసర్ జేక్ బాల్ అంటున్నాడు. గురువారం కటక్‌లో ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకుంటే తమ విజయం నల్లేరుపై నడకేనని చెప్పాడు.
 
సాధ్యమైనంత వరకు కోహ్లీని క్రీజులో కుదురుకోనీయకుండా అతడికి ముకుతాడు వేస్తామని, ఇందుకు షార్ట్ పిచ్ బంతులను మార్గం ఎంచుకుంటామని పేసర్ జేక్ బాల్ తెలిపాడు. కోహ్లీని ఔట్ చేయడానికి తమ వద్ద మరిన్ని ఎత్తులతో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. పుణే వన్డేలో 3/67తో రాణించిన ఈ పేసర్.. కోహ్లీలాంటి అత్యుత్తమ ఆటగాడిని త్వరగా పెవిలియన్ బాట పట్టించాలని, లేకపోతే తమ జట్టు మరోసారి మూల్యం చెల్లించుకోక తప్పదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల టెస్ట్ సిరీస్‌లో కోహ్లీ ఆటను చూశాను.. ఇప్పుడు వన్డేల్లోనూ కోహ్లీ కుమ్మేస్తున్నాడని  ప్రశంసించాడు.  
 
మొత్తం మీద కోహ్లీ భూతం ఇంగ్లండ్‌ జట్టును నిద్రలోనూ వెంటాడుతున్నట్లుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments