Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్ జాదవ్ రనౌట్‌తో గెలవలేదు... గెలుపుకు అదే కారణం : మోర్గాన్

కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (10:52 IST)
కోల్‌కతా వేదికగా భారత్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్‌లో కేదార్ జాదవ్ రనౌట్ కావడం వల్లే ఇంగ్లండ్ గెలిచిందన్న చర్చ సరైనది కాదన్నారు. అసలు తమ గెలుపునకు ముఖ్య కారణం ఈడెన్ గార్డెన్ మైదానమేనని చెప్పారు. ఈ మైదానంతో పాటు.. పిచ్ అచ్చం ఇంగ్లండ్ మైదానం, పిచ్‌‌లాగే ఉందని అందుకే విజయం సాధించినట్టు చెప్పారు. 
 
ఇక్కడ పిచ్‌లు భారత ఆటగాళ్లకు బాగా అలవాటని అందుకే భారత బ్యాట్స్‌మన్ బాగా రాణించగలిగారని అన్నాడు. అయితే తమ దేశంలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ఇలాంటి పిచ్‌పై మ్యాచ్ జరగడం అందులో తాము గెలవడంతో మంచి ప్రాక్టీస్‌గా భావిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. 
 
కాగా, ఈ వన్డే మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెల్సిందే. తీవ్ర ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో ఇంకా నాలుగు బంతులు ఉన్నంత వరకూ మ్యాచ్ భారత్ వైపే ఉంది. ఆ సమయంలో కేదార్ జాదవ్ అనూహ్యంగా ఔట్ కావడంతో కోహ్లీసేనకు ఓటమి తప్పలేదు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments