Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో టెస్ట్ : ఇంగ్లండ్ వెన్ను విరిచిన అక్షర్ పటేల్

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:45 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్ - భారత్ క్రికెట్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. డే అండ్ నైట్ తరహాలో జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్‌‍ ఎంచుకుంది. అయితే, భారత స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లండ్ వణికిపోయింది. భారత స్పిన్నర్లు చెలరేగడంతో 48.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా అక్సర్ పటేల్, అశ్విన్‌లు రెచ్చిపోయారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను ఆదిలోనే పేసర్ ఇశాంత్ శర్మ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు 2 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ సిబ్లీని (డకౌట్) ఇశాంత్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన స్పిన్నర్ల దెబ్బకు ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వరుసగా పెవిలియన్ చేరారు. ఇంగ్లండ్ జట్టులో క్రాలీ మాత్రమే అత్యధికంగా 53 పరుగులు చేశాడు. 
 
మిగిలిన ఆటగాళ్ళలో బెయిర్ స్టో (0), జో రూట్ (17), స్టోక్స్ (6), పోప్ (1), ఫోక్స్ (12), ఆర్చర్ (11), లీచ్ (3), బ్రాడ్ (3) పరుగులు చేశారు. అండర్సన్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్సర్ పటేల్ 6, అశ్విన్ 3 వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం భారత్ తన తొలి ఇన్నింగ్స్ చేపట్టింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం