Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు లేకపోయినా భారత్ గెలిచింది.. : మైఖేల్ వాన్

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:52 IST)
స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచింది. దీంతో ఐదు టెస్టా మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, భారత్ క్రికెట్ వరుస విజయాలు, ఇంగ్లండ్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించారు. 
 
"భారత క్రికెట్ జట్టులో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఐదుగురు లేరు. పైగా ఆ జట్టు టాస్ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌‍లో ప్రత్యర్థి కంటే తక్కువ పరుగులు చేసింది. అయినప్పటికీ మ్యాచ్ గెలిచింది" అంటూ కితాబిచ్చాడు. ఈ మ్యాచ్ పూర్తి ఘనత టీమిండియాకే దక్కుతుందన్నారు. ఈ టెస్టు విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని అని వాన్ పేర్కొన్నారు. చాలామంది యువ ఆటగాళ్ళు భారత జట్టులోకి వచ్చారని, వారు చాలాకాలం పాట జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రశంసించారు. 
 
నిజానికి ఏ చిన్న అవకాశం లభించినా భారత్‌పై విరుచుకుపడే మైఖేల్ వాన్ మాత్రం రాంచీ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఓ దశలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుకే ఐదు వికెట్లు కోల్పోగానే వాన్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

తర్వాతి కథనం
Show comments