ఐదుగురు వరల్డ్ క్లాస్ ప్లేయర్లు లేకపోయినా భారత్ గెలిచింది.. : మైఖేల్ వాన్

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:52 IST)
స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌లలో మూడింటిలో గెలిచింది. దీంతో ఐదు టెస్టా మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, భారత్ క్రికెట్ వరుస విజయాలు, ఇంగ్లండ్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించారు. 
 
"భారత క్రికెట్ జట్టులో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఐదుగురు లేరు. పైగా ఆ జట్టు టాస్ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్‌‍లో ప్రత్యర్థి కంటే తక్కువ పరుగులు చేసింది. అయినప్పటికీ మ్యాచ్ గెలిచింది" అంటూ కితాబిచ్చాడు. ఈ మ్యాచ్ పూర్తి ఘనత టీమిండియాకే దక్కుతుందన్నారు. ఈ టెస్టు విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని అని వాన్ పేర్కొన్నారు. చాలామంది యువ ఆటగాళ్ళు భారత జట్టులోకి వచ్చారని, వారు చాలాకాలం పాట జట్టులో కొనసాగే అవకాశాలు ఉన్నాయని ప్రశంసించారు. 
 
నిజానికి ఏ చిన్న అవకాశం లభించినా భారత్‌పై విరుచుకుపడే మైఖేల్ వాన్ మాత్రం రాంచీ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఓ దశలో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగుకే ఐదు వికెట్లు కోల్పోగానే వాన్ రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. దూసుకొస్తున్న వాయుగుండం... ఏపీకి ఆరెంజ్ అలెర్ట్

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఆర్టీసీ బస్సులు కొనుగోలు : బ్రహ్మానంద రెడ్డి

రాహుల్ జీ... దయచేసి త్వరగా పెళ్లి చేసుకోండి...

ఢిల్లీ ప్రజలకు ఊపిరాడటం లేదు.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం

యూపీలో దారుణం : దళితుడిపై అగ్రవర్ణాల దాష్టీకం.. బూట్లు నాకించి.. చేయి విరగ్గొట్టారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments