Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్ ఛారిటీ మ్యాచ్‌లో ధోనీ, సెహ్వాగ్, అఫ్రిదీలకు చోటు!

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (17:43 IST)
క్రికెట్ అభిమానులకో శుభవార్త. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఏడాది టీమిండియా కెప్టెన్ ధోనీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది 'హెల్ప్ ఫర్ హీరోస్' పేరిట ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఛారిటీ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు పాల్గొననున్నారు.
 
ఆ ఆటగాళ్ల జాబితాలో ధోనీ, సెహ్వాగ్, పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిదీ కూడా చోటు సంపాదించుకున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను ఈసీబీ డైరెక్టర్ ఆండ్రూ నిర్వహిస్తుండగా, గవాస్కర్ కూడా నిర్వహణలో పాలుపంచుకోనున్నారు.
 
కాగా, అంతర్జాతీయ స్టార్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి ఆశయం కోసం జరుగుతున్న మ్యాచ్‌లో భాగం కావడం గర్వకారణమని ధోనీ తెలిపాడు. అంతేగాకుండా ఈ మ్యాచ్‌కు అందరి మద్దతు అవసరమన్నాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments