Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె ఓటమి టీమిండియాకు మంచే చేసింది : కెప్టెన్ ధోనీ

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (10:23 IST)
శ్రీలంకతో పూణేలో జరిగిన తొలి టీట్వంటీ మ్యాచ్‌లో ఓటమి టీమిండియాకు మంచే చేసిందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన కారణంగా పర్యాటక శ్రీలంక జట్టు చేతిలో ఓడిన విషయం తెల్సిందే. దీనిపై ధోనీ స్పందిస్తూ.. బ్యాట్స్‌మన్ షాట్ సెలక్షన్ కొంపముంచిందన్నాడు. 
 
వన్డేల్లా వేచి చూసి ఆడే అవకాశం టీట్వంటీల్లో ఉండదని గుర్తు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ విఫలం కావడంతో జట్టులోని అందరూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని, దీంతో ఎవరు ఎలా ఆడతారు అనే అంచనా చిక్కిందని ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
జట్టు మొత్తం విఫలమవడంతో విజయగర్వంతో ఆడకూడదని ఆటగాళ్లకు అర్థమై ఉంటుందని ధోనీ చురకంటించాడు. శ్రీలంక ఆటగాళ్లలో రజిత, శనక, చమీరలు అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. రెండో టీట్వంటీలో జట్టు పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ధోనీ వ్యక్తం చేశాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments