Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : రోహిత్ అర్థ సెంచరీ.. యూఏఈపై భారత్ ఘన విజయం!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:47 IST)
వరల్డ్ కప్ టోర్నీలో భారత్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం పెర్త్ వేదికగా క్రికెట్ పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన ఈ టోర్నీ 21వ లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో భారత్ ఇప్పటి వరకు తాను ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలుపొంది గ్రూపు బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యుఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 102 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా భారత స్పిన్ తాకిడికి విలవిల్లాడిపోయింది. ఆ జట్టులో అన్వర్ (35), ఖుర్రుమ్ ఖాన్ (14), గురుజ్ (10)లు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. అదనపు పరుగుల రూపేణా భారత బౌలర్లు 13 పరుగులు సమర్పించడం గమనార్హం. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా, యాదవ్, జడేజాలు రెండేసి వికెట్లు, కుమార్, శర్మలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 103 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టానికి 18.5 ఓవర్లలో 104 పరుగులు చేసింది. భారత ఓపెనర్లలో రోహిత్ శర్మ (57) అర్థ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర ధావన్ 14 పరుగులు చేశాడు. ధావన్ ఔట్ కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ వికెట్‌ను చేజార్చుకోకుండా (33 నాటౌట్) ఆడి.. జట్టుకు విజయాన్ని అందించాడు. నవీద్ బౌలింగ్‌లో ధావన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అశ్విన్‌కు లభించింది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments