Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు... స్వదేశానికి సాఫారీలు

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (08:50 IST)
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన వన్డే సిరీస్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రద్దు చేసింది. భారత్ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగాల్సివుంది. ఈ సిరీస్‌లో భాగంగా, తొలి వన్డే ధర్మాశాలలో జరగాల్సివుంది. కానీ, వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దు అయింది. ఈ నేపథ్యంలో లక్నో, కోల్‌కతాలలో జరగాల్సిన రెండు, మూడు వన్డేలను కూడా రద్దు చేసింది. 
 
నిజానికి ఈ రెండు వన్డే మ్యాచ్‌లను ఒకే వేదికలో అంటే లక్నోలో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకుండా నిర్వహించాలని భావించారు. కానీ, దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పైగా, ఈ వైరస్ బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో ఈ రెండు వన్డేలను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫలితంగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లిపోయారు. 
 
కాగా, ఇప్పటికే ఈ నెల 29వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 వేడుకలను కూడా వచ్చే నెలకు వాయిదా వేశారు. అప్పటికీ దేశంలో కరోనా వైరస్ అదుపులోకి రాకుంటే ఈ టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐతో పాటు.. ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించారు. కాగా, కరోనా దెబ్బకు అనేక క్రిడా పోటీల నిర్వహణను వాయిదావేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments