Webdunia - Bharat's app for daily news and videos

Install App

కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానన్న నిత్యానంద.. వీసా ఎలా తీసుకోవాలి స్వామి..

Webdunia
బుధవారం, 4 డిశెంబరు 2019 (17:09 IST)
వివాదాస్పద స్వామి నిత్యానంద స్వామికి భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తేరుకోలేని కౌంటరిచ్చారు. కైలాశ దేశానికి వీసా ఎలా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. ఇంతకీ నిత్యానందను టార్గెట్ చేస్తూ అశ్విన్ ఎందుకు కౌంటర్ వేశారో పరిశీలిద్ధాం. 
 
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యానంద స్వామి... తాను కైలాస దేశాన్ని ఏర్పాటు చేశానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. 
 
పైగా, కరీబియన్ దీవుల సమీపంలో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద... ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశంగా తన దీవిని పేర్కొన్నారు. ఆ దేశానికి ఒక జెండా, రాజ్యాంగం, అధికారం చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. తన దేశంలో ప్రధానితో పాటు చిన్నసైజు కేబినెట్ కూడా ఉందని చెప్పారు. విరాళాలను ఇవ్వడం ద్వారా తన దేశ పౌరసత్వాన్ని పొందవచ్చని తెలిపారు.
 
ఈ వ్యాఖ్యలపై క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. 'కైలాస దేశానికి వీసా పొందడానికి ప్రొసీజర్ ఏమిటి? వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉందా?' అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. మరి అశ్విన్‌ ప్రశ్నకు నిత్యానంద అనుచరులు ఏ విధంగా సమాధానిమిస్తారో వేచిచూడాలి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments