Webdunia - Bharat's app for daily news and videos

Install App

500 సిక్సర్ల వీరుడు.. ఎవరు...

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (11:19 IST)
వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్. ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లోకి వచ్చినా.. లేదా పబ్బులు, క్లబ్బుల్లో తిరిగినా అది మీడియాకు ఓ మంచి వార్త. తాజాగా క్రిస్ గేల్ మరోమారు మీడియా దృష్టిని ఆకర్షించాడు. వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటేశాడు. 
 
సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ 162 ర‌న్స్ చేశాడు. గేల్‌కు ఇది 25వ వ‌న్డే సెంచ‌రీ కాగా, 39 ఏళ్ల గేల్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మెట్లలో కలుపుకుని 500 సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు. 
 
అలాగే, వ‌న్డేల్లో ప‌దివేల ప‌రుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చ‌రిత్ర‌కెక్కాడు. ఈ ఘ‌ట‌న సాధించిన రెండో వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడిగా గేల్ నిలిచాడు. గతంలో వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగుల చేసిన ప్లేయ‌ర్ల‌లో బ్రియాన్ లారా ముందు వరుసలో ఉన్నాడు. కాగా, త్వరలో జరుగనున్న ప్రపంచ క్రికెట్ కప్ తర్వాత క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. 

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments