Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మా దేశానికి ఎందుకు రాదో లిఖితపూర్వకంగా బదులివ్వాలి : పీసీబీ

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (10:16 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సివుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జై షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. అయితే, తమ దేశంలో భారత క్రికెట్ జట్టు ఎందుకు పర్యటించదో తమకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పీసీబీ కోరుతుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో ఈ టోర్నీ జరుగనుంది. భద్రతా కారణాల రీత్యా ఆతిథ్య పాకు టీమిండియాను పంపించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇది పీసీబీ ఏమాత్రం రుచించడం లేదు. అందుకే లిఖతపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కోరుతుంది. అదేసమయంలో ఇరుదేశాల మధ్య మరో వివాదం చెలరేగింది.
 
భారత్ వేదికగా మంగళవారం ముగిసిన ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు ఇవ్వలేదని కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు ఆరోపించారు. రెండు నెలల ముందుగానే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తాత్సారం చేశారని చెబుతున్నారు. అయితే పాక్ జట్టుకు 12 వీసాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు తిరస్కరించామంటూ వచ్చిన మీడియా కథనాలను చూశామని, నవంబర్ 7వ తేదీన 12 మంది పాక్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. సకాలంలోనే జారీ చేశామని అన్నారు. అయితే పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లందరికీ వీసాలు జారీ చేయలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. వీసా పొందిన ప్లేయర్లు కూడా చాలా ఆలస్యంగా ఆ వీసాలు అందుకున్నారని, దీంతో భారత్‌కు రాలేకపోయారని పేర్కొన్నారు.
 
కాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో భారత్‌కు వచ్చి టోర్నీలో పాల్గొని గెలిచిన ఆటగాళ్లతో పాటు జట్టులోని సగం మంది ఆటగాళ్లకు వివరణ లేకుండానే వీసాలు తిరస్కరించారని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments