Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా మా దేశానికి ఎందుకు రాదో లిఖితపూర్వకంగా బదులివ్వాలి : పీసీబీ

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (10:16 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సివుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత క్రికెట్ జట్టు నిరాకరించింది. ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జై షా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారు. అయితే, తమ దేశంలో భారత క్రికెట్ జట్టు ఎందుకు పర్యటించదో తమకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని పీసీబీ కోరుతుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లో ఈ టోర్నీ జరుగనుంది. భద్రతా కారణాల రీత్యా ఆతిథ్య పాకు టీమిండియాను పంపించబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. ఇది పీసీబీ ఏమాత్రం రుచించడం లేదు. అందుకే లిఖతపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ కోరుతుంది. అదేసమయంలో ఇరుదేశాల మధ్య మరో వివాదం చెలరేగింది.
 
భారత్ వేదికగా మంగళవారం ముగిసిన ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్, ఢిల్లీ కప్‌లో పాల్గొనేందుకు తమకు వీసాలు ఇవ్వలేదని కొందరు పాకిస్థాన్ ఆటగాళ్లు ఆరోపించారు. రెండు నెలల ముందుగానే దరఖాస్తులు చేసుకున్నప్పటికీ తాత్సారం చేశారని చెబుతున్నారు. అయితే పాక్ జట్టుకు 12 వీసాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు తిరస్కరించామంటూ వచ్చిన మీడియా కథనాలను చూశామని, నవంబర్ 7వ తేదీన 12 మంది పాక్ ఆటగాళ్లకు వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. సకాలంలోనే జారీ చేశామని అన్నారు. అయితే పాకిస్థాన్ జట్టులోని ఆటగాళ్లందరికీ వీసాలు జారీ చేయలేదని మరికొందరు అధికారులు చెబుతున్నారు. వీసా పొందిన ప్లేయర్లు కూడా చాలా ఆలస్యంగా ఆ వీసాలు అందుకున్నారని, దీంతో భారత్‌కు రాలేకపోయారని పేర్కొన్నారు.
 
కాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో భారత్‌కు వచ్చి టోర్నీలో పాల్గొని గెలిచిన ఆటగాళ్లతో పాటు జట్టులోని సగం మంది ఆటగాళ్లకు వివరణ లేకుండానే వీసాలు తిరస్కరించారని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు పాల్గొనడంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments