భారత్ మ్యాచ్‌లన్నీ యూఏఈకి తరలిపాయె... గత్యంతరం లేక అంగీకరించిన పాక్

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (12:03 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ పోటీల నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌..ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో వచ్చే యేడాది మార్చి ఒకటో తేదీన భారత్ - పాకిస్థాన్, మార్చి 9న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తేల్చి చెప్పింది. లేకపోతే ఈ టోర్నీకి భారత్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. ఒక వేళ ఈ టోర్నీకి భారత్ రాకుంటే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాకిస్థాన్.. తన వైఖరిని మార్చుకుంది. 
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ పర్యటనకు భారత్ సర్కార్ అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు పిసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ కథనంలో పేర్కొంది.
 
ఈ క్రమంలో టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది. 
 
గతంలో కూడా 2023 అసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా, హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు అదే మాదిరిగా యూఏఈలో మ్యాచ్ నిర్వహణకు పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments