Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ మ్యాచ్‌లన్నీ యూఏఈకి తరలిపాయె... గత్యంతరం లేక అంగీకరించిన పాక్

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (12:03 IST)
వచ్చే యేడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ పోటీల నిర్వహణ హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌..ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో వచ్చే యేడాది మార్చి ఒకటో తేదీన భారత్ - పాకిస్థాన్, మార్చి 9న లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే భారత్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ తేల్చి చెప్పింది. లేకపోతే ఈ టోర్నీకి భారత్ దూరంగా ఉంటుందని వెల్లడించింది. ఒక వేళ ఈ టోర్నీకి భారత్ రాకుంటే తీవ్రంగా నష్టపోతామని భావించిన పాకిస్థాన్.. తన వైఖరిని మార్చుకుంది. 
 
ఈ టోర్నీలో పాకిస్థాన్ పర్యటనకు భారత్ సర్కార్ అనుమతించకపోతే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు పిసీబీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలోని దుబాయ్ లేదా షార్జాలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లుగా పీటీఐ కథనంలో పేర్కొంది.
 
ఈ క్రమంలో టోర్నీని హైబ్రీడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే ఇబ్బందులు రాకుండా ఐసీసీ ముందుగానే అప్రమత్తమైంది. భారత జట్టు మ్యాచ్లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితులు ఎదురైతే అందుకు అవసరమైన నిధులను టోర్నీ బడ్జెట్లో కేటాయించింది. 
 
గతంలో కూడా 2023 అసియా కప్ పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉండగా, హైబ్రిడ్ విధానం అనుసరించి భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు అదే మాదిరిగా యూఏఈలో మ్యాచ్ నిర్వహణకు పీసీబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments