Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు: భారత్-పాక్‌ మ్యాచ్‌కు జోరందుకున్న పందేలు.. రూ.2వేల కోట్ల వరకు?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎ

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:21 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముంబై పేలుళ్లకు అనంతరం ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు చోటుచేసుకోని నేపథ్యంలో.. అంతర్జాతీయ వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో దాయాదీ దేశాలు పోరుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.  
 
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై అంతర్జాలం వేదికగా రూ.2,000 కోట్ల విలువ మేర పందేలు జరుగుతున్నట్టు అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఎక్కువ మంది బుకీలు భారత్‌కు ఫేవర్‌గా ఉన్నారు. భారత్ ఏడాది పొడవునా ఆడే మ్యాచులపై సుమారు రూ.2లక్షల కోట్ల మేర పందేలు జరుగుతుంటాయని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ సీఈవో రోలాండ్ ల్యాండర్స్ తెలిపారు. గత పదేళ్లలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఇదే కావడంతో బెట్టింగ్ జోరందుకుందని.. పందేలు తారాస్థాయిలో ఉన్నాయని ల్యాండర్స్ వివరించారు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments