Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు: భారత్-పాక్‌ మ్యాచ్‌కు జోరందుకున్న పందేలు.. రూ.2వేల కోట్ల వరకు?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎ

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:21 IST)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరుగనున్న ఫైనల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాయాదుల మధ్య జరిగే ఈ పోరు కోసం భారత్-పాక్ ప్రజలు, క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ముంబై పేలుళ్లకు అనంతరం ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్‌లు చోటుచేసుకోని నేపథ్యంలో.. అంతర్జాతీయ వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరులో దాయాదీ దేశాలు పోరుకు సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.  
 
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై అంతర్జాలం వేదికగా రూ.2,000 కోట్ల విలువ మేర పందేలు జరుగుతున్నట్టు అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఎక్కువ మంది బుకీలు భారత్‌కు ఫేవర్‌గా ఉన్నారు. భారత్ ఏడాది పొడవునా ఆడే మ్యాచులపై సుమారు రూ.2లక్షల కోట్ల మేర పందేలు జరుగుతుంటాయని అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ సీఈవో రోలాండ్ ల్యాండర్స్ తెలిపారు. గత పదేళ్లలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ ఇదే కావడంతో బెట్టింగ్ జోరందుకుందని.. పందేలు తారాస్థాయిలో ఉన్నాయని ల్యాండర్స్ వివరించారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments