Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికాకు తరలిపోనున్న చాంపియన్స్ ట్రోఫీ వేదిక.. పాకిస్థాన్ దూరం!?

ఠాగూర్
మంగళవారం, 12 నవంబరు 2024 (13:14 IST)
వచ్చే యేడాదిలో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సివుంది. అయితే, పాకిస్థాన్‌లో జరిగే మ్యాచ్‌లకు హాజరుకారాదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. ఈ టోర్నీకి భారత్ క్రికెట్ జట్టు దూరమైనపక్షంలో పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు భారీగా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో మధ్యేమార్గం భారత్ ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను తటస్థ వేదికలైన షార్జా, యూఏఈ వంటి దేశాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి ఐసీసీ సమ్మతం తెలిపింది. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం నో చెబుతోంది. 
 
పైగా, తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీని వీడాలని పాక్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య వివాదాలు పరిష్కారమయ్యే వరకు.. భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదని పాకిస్థాన్ భావిస్తోందట. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు తమ ఆసక్తిని తెలియజేస్తూ ఐఓసీ భవిష్యత్‌ ఆతిథ్య కమిషన్‌కు భారత్‌ లేఖ ఇచ్చింది. అయితే పాకిస్థాన్‌ ఇందుకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేయాలనుకుంటుందని పాక్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
 
ఒకవేళ పీసీబీ ఇలాగే మొండిగా వ్యవహరించి హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించకపోతే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. 'ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ విధానంలో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంపై ఎలాంటి చర్చలు జరగలేదు. మొత్తం పరిస్థితిని పీసీబీ అంచనా వేస్తోంది. తదుపరి ఏం చేయాలనే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహరంపై పాక్‌ ప్రభుత్వం, బోర్డు చర్చలు జరుపుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బోర్డు పనిచేస్తుంది' అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments