Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు.. వారి ప్రతిభ ప్రతిధ్వనిస్తోంది : విరాట్ కోహ్లీ

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఒక్క ఓటమితో యువత భారత జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పాకిస్థాన్ క

Webdunia
సోమవారం, 19 జూన్ 2017 (13:00 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ ఒక్క ఓటమితో యువత భారత జట్టుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఏకంగా 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ ఆటగాళ్ల గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫైనల్ మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్ జట్టుకు అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఈ టోర్నమెంటులో వాళ్లు అద్భుతంగా ఆడారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్న విధానం చూస్తేనే వారి ప్రతిభ ప్రతిధ్వనిస్తోంది. వాళ్లు మరోసారి దాన్ని రుజువు చేసుకున్నారు. 
 
వాళ్లకు అవకాశం వచ్చినప్పుడు ఎవరినైనా తలకిందులు చేయగలరు. ఫకార్ జమాన్ వంటి వారు 80 శాతం పరుగులు అత్యంత రిస్క్ తీసుకుని చేయడంతో వారిని నిలువరించడం కష్టమైంది. ఈ ఓటమి మాకు నిరాశకలిగించే విషయమైనా... ఫైనల్‌కి చేరేందుకు మేము కూడా బాగా ఆడుతూ వచ్చాం. అందుకే నా ముఖంపై ఈ మాత్రమైనా చిరునవ్వు కనిపిస్తోంది.. కొన్నిసార్లు మనం ప్రత్యర్థి ప్రతిభను కూడా సంతోషంగా ఒప్పుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

Rapido: ఎందుకలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? ర్యాపిడో డ్రైవర్‌ను నిలదీసిన యువతికి చెంపదెబ్బ (video)

Sonia Gandhi: ఉదర రుగ్మతతో ఆస్పత్రిలో సోనియా గాంధీ: నిలకడగానే ఆరోగ్యం

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పోటీలు : ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు - విద్యార్థులకు భారత్ అలెర్ట్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

తర్వాతి కథనం
Show comments