Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరు జట్లను ఊరిస్తున్న ఓవెల్ టెస్ట్ మ్యాచ్ ఫలితం

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (16:08 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవెల్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లనూ ఊరిస్తుంది. ఆతిథ్య ఇంగ్లండ్ ముంగిట 368 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ప్రస్తుతం విజయానికి మరో 291 పరుగుల దూరంలో ఉంది. అదేసమయంలో టీమిండియా గెలవాలంటే చివరి రోజు పది వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఆట థ్రిల్లర్‌ను తలపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మాత్రం 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్‌లో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఈ మైదానంలో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. ఆ మ్యాచ్‌లో అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.
 
ఆ తర్వాత టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. వరుసగా గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) భారత్ ఘోర పరాజయాలను చవిచూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments