Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు ఓవర్లు ఉండగానే మనం గెలుస్తున్నామని బుమ్రాతో చెప్పా: ఆశిష్ నెహ్రా

డెత్ ఓవర్లలో బౌలర్‌కు ఆత్మవిశ్వాసం ముఖ్యం, బుమ్రా అక్కడే గెలుపొందడంటున్న ఆశీష్ నెహ్రా

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (00:42 IST)
ఇంగ్లండ్ లక్ష్యఛేదనలో దూకుడు చూపిస్తున్నప్పటికీ చివరివరకు గెలుపు విషయంలో తనకెలాంటి సందేహం లేదని భారత క్రికెట్ జట్టు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా తెలిపారు. నాలుగు ఓవర్లలో 32  పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ విజృంభిస్తున్నప్పటికీ రెండో టీ-20 ఆటలో మనమే గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పానంటున్న నెహ్రా తీవ్రమైన ఒత్తిడితో సాగుతున్న గేమ్‌లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఇదేమీ తొలిసారి కాదని తెలిపాడు. ఇంగ్లండును నిలవరించడానికి బుమ్రాను స్వేచ్ఛగా బౌలింగ్ చేయనివ్వాలని తాను కోరుకున్నానని రెండో టీ-20లో అతని నైపుణ్యానికి నిజంగా అభినందనలు తెలుపుతున్నానని నెహ్రా ప్రశంసించాడు. 
 
డెత్ ఓవర్లలో అద్వితీయ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించడం బుమ్రాకు ఇది తొలిసారేమీ కాదని నెహ్రా చెప్పాడు. లెంగ్త్ బాల్స్ వేయొచ్చా అని చివరి ఓవర్‌కు ముందు బుమ్రా తనను అడిగాడని, నీవు మంచి యార్కర్లు వేయగలవు. ఫుల్ బాల్స్ వేయడానికి ప్రయత్నించు, ఈ దశలో లో ఫుల్ టాస్ బంతి సంధించినా బ్యాట్స్‌మన్ దాన్ని సిక్స్‌గా మలచడం చాలా కష్టమని చెప్పాను. సరిగ్గా అది పనిచేసింది. నాలుగు ఓవర్లలో 32 పరుగులు ఇంగ్లండ్ చేయవలసి వచ్చినప్పుడే మనం గెలువబోతున్నామని బుమ్రాతో చెప్పాను అని నెహ్రా తెలిపాడు.
 
చివరి ఓవర్లలో బౌలింగ్ చేయవలసి వచ్చినప్పుడు ఓ బౌలర్‌కైనా తనపై తనకు నమ్మకం ఉండాలని, బుమ్రా తనపై తాను విశ్వాసం ఉంచుకోవడమే ఈ అద్బుత గెలుపుకు కారణమని నెహ్రా విశ్లేషించాడు.
 
రెండో టీ-20  మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 5 బంతుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియా 3 మ్యాచ్‌ల సీరీస్‌ను 1-1 తో సమానం చేసింది. ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగనున్న మూడో టీ-20 సీరీస్ విజేతను తేల్చనుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments