బోర్డుకు తలవంపులు తెచ్చే పనులు చేస్తారా.. కోహ్లీ - శాస్త్రిలపై ఫైర్

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (14:55 IST)
బోర్డుకు తలవంపులు తెచ్చే పనులు చేసిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే, టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ గిరీష్ డోంగ్రె పాత్ర‌ను కూడా బోర్డు ప‌రిశీలిస్తోంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. 
 
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సభ్యుల్లో కోచ్ రవిశాస్త్రితో పాటు.. మరో ఇద్దరు సహాయక సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ వ్యవహారంపై కోచ్ ర‌విశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీల‌పై బీసీసీఐ గుర్రుగా ఉంది. పైగా, ఈ ఇద్ద‌రి నుంచి బోర్డు వివ‌ర‌ణ కోరిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కోచ్ ర‌విశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధ‌ర్‌ల‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేలిన విష‌యం తెలిసిందే. అయితే వీళ్లంతా లండ‌న్‌లో గ‌త వారం జ‌రిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లి వ‌చ్చిన త‌ర్వాతే క‌రోనా బారిన ప‌డిన‌ట్లు తేలింది. 
 
ఈ ముగ్గురూ కొవిడ్ బారిన ప‌డినా.. కెప్టెన్ కోహ్లితోపాటు ఇత‌ర ప్లేయ‌ర్స్‌కు మాత్రం నెగిటివ్ వ‌చ్చింది. అయితే ఈ బుక్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్ల‌డానికి టీమ్ స‌భ్యులు.. బీసీసీఐ అనుమ‌తి కోర‌లేద‌ని తెలిసింది. దీంతో ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న బోర్డు.. విచార‌ణ జ‌ర‌ప‌నుంది. ఇదే విషయంపై వివరణ కోరుతూ బీసీసీఐ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఇది బోర్డుకు త‌ల‌వంపులు తీసుకొచ్చింది. నాలుగో టెస్ట్ ముగియ‌గానే కోహ్లి, శాస్త్రిల‌ను బోర్డు వివ‌ర‌ణ కోరుతుంది. వీళ్లు ఈ ఈవెంట్‌కు వెళ్ల‌డంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ‌ర్ గిరీష్ డోంగ్రె పాత్ర‌ను కూడా బోర్డు ప‌రిశీలిస్తోంది అని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. ఆటగాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇలాంటి ఈవెంట్‌ల‌కు వెళ్లొద్దంటూ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ఒక్కో ప్లేయ‌ర్‌కు ప్ర‌త్యేకంగా నోటీసులు పంపినా.. ప్లేయ‌ర్స్ ఇలా నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించడాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments