Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక వేదికగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్: ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్ పండగ?!

Webdunia
సోమవారం, 23 నవంబరు 2015 (15:03 IST)
భారత్-పాకిస్థాన్ సిరీస్‌ వేదిక శ్రీలంకకు మారనుంది. భారత్‌లో ఆడేందుకు పీసీబీ ఒప్పుకోకపోవడంతో పాటు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్‌లో ఆడేందుకు బీసీసీఐ కూడా అంగీకరించకపోవడంతో భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌కు శ్రీలంక వేదిక కానుందని తెలుస్తోంది. దాదాపు 8 సంవత్సరాల తర్వాత జరిగే ఈ సిరీస్‌ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సమాయత్తమవుతున్నాయి. 
 
ఈ క్రమంలో ఆదివారం దుబాయిలో బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్‌లు భేటీ అయ్యారు. ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు విశ్వవ్యాప్త క్రికెట్ ప్రేమికులు ఆశగా ఎదురు చూస్తున్న భారత్-పాక్ సిరీస్ నిర్వహణకు సంబంధించి వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.
 
వేదికలకు సంబంధించి ఒకరి ప్రతిపాదనను మరొకరు తిరస్కరించిన నేపథ్యంలో ఇరు దేశాలకు సమీపంలోని శ్రీలంకను వేదికగా చేసుకునే అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. శశాంక్, షహర్యార్‌ల చర్చల్లో పాలుపంచుకున్న ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధ్యక్షుడు గైల్స్ క్లార్క్ ఈ సిరీస్‌పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments