Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో భారత్ ఆడట్లేదు.. మ్యాచ్ పాయింట్లలో ఐసీసీ కోత.. బీసీసీఐ సీరియస్

ముంబై పేలుళ్ల అనంతరం టీమిండియా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ప్రపంచ కప్ మ్యాచ్ మినహాయించి.. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య సంబంధాలు

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (16:58 IST)
ముంబై పేలుళ్ల అనంతరం టీమిండియా పాకిస్థాన్‌తో క్రికెట్ సిరీస్ ఆడలేదు. ప్రపంచ కప్ మ్యాచ్ మినహాయించి.. పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐ మధ్య సంబంధాలు మరోసారి దిగజారాయి. పురుషుల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌తో కలిసి ఆడే ఛాన్సులు లేకపోవడంతో.. ఇక మహిళల జట్టును ఐసీసీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో ఐసీసీ ఒప్పందం ప్రకారం ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 31 వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ ఆడలేదని భారత మహిళల క్రికెట్‌ జట్టుకు ఐసీసీ సాంకేతిక బృందం మ్యాచ్‌ పాయింట్ల కోత విధించింది.   
 
మొత్తం 3 మ్యాచ్‌లకు 2 పాయింట్ల చొప్పున 6 పాయింట్ల కోసింది. 50 ఓవర్లకు సున్నా పరుగుల ప్రకారం రన్‌రేట్‌ను సవరిస్తామని వెల్లడించింది. పాక్‌తో ఆడకపోవడానికి బీసీసీఐ సరైన కారణాలు చూపలేదని సాంకేతిక బృందం పేర్కొంది. అయితే మ్యాచ్ పాయింట్ల కోతపై బీసీసీఐ ఫైర్ అయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. ఈ విషయం ఐసీసీ ఛైర్మన్‌కు బాగా తెలుసునని బీసీసీఐ స్పందించింది.  
 
పాకిస్థాన్ దాడుల్లో భారత సైనికులు అమరులవుతున్న సంగతి ఐసీసీకి బాగా తెలుసు. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ ఆడాలనే కోరిక చనిపోయింది. తమకు ప్రభుత్వం అనుమతి ఇస్తేనే పాక్‌తో ఆడేందుకు వీలుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఐసీసీ తిరిగి సరైన బాటలో నడవకుంటే పురుషులతో పాటు మహిళల జట్టూ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడదని' బీసీసీఐ హెచ్చరించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగారం ఆమె ఆస్తి... విడాకులు తీసుకుంటే తిరిగి ఇచ్చేయాల్సిందే : కేరళ హైకోర్టు

భర్త కళ్లెదుటే మహిళా డ్యాన్సర్‌ను అత్యాచారం చేసిన కామాంధులు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments