Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు టెస్ట్ మ్యాచ్ డ్రా : నాలుగో రోజూ వర్షంతో అంపైర్ల నిర్ణయం

Webdunia
బుధవారం, 18 నవంబరు 2015 (12:16 IST)
ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి రోజు ఆట తర్వాత వరుసగా నాలుగు రోజులుగా వర్షం అడ్డంకిగా మారిన విషయం తెల్సిందే. దీంతో ఐదో రోజైన నేడు వర్షం కారణంగా ఆట జరగని నేపథ్యంలో మ్యాచ్‌ను అంపైర్లు డ్రాగా ప్రకటించారు. 
 
కాగా, శనివారం ప్రారంభమైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. ప్రత్యర్థి సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. కేవలం 59 ఓవర్లలోనే సఫారీలను 214 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ల ధాటికి కుప్పకూలింది. 
 
ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండానే 22 ఓవర్లలో 80 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి రోజు నుంచే వరుణుడు మ్యాచ్‌కు అడ్డంకిగా నిలిచాడు. మ్యాచ్ డ్రాగా ముగియడంతో టీమిండియా సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న విషయం తెల్సిందే. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో మూడో టెస్టు నాగ్‌పూర్ వేదికగా ఈ నెల 25న ప్రారంభం కానుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments