Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారు పెట్టిస్తున్న భారత స్పిన్ ఉచ్చు - జట్టులోకి కొత్తగా మరో స్పిన్నర్

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (17:31 IST)
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. గవాస్కర్ - బోర్డర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, ఇటీవల నాగ్‌పూర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోయింది. భారీ పరాజయాన్ని చవిచూసింది. భారత్ స్పిన్ ఉచ్చులో చిక్కున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు కంగారుపడిపోయి విలవిల్లాడిపోయారు. ఫలితంగా నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. 
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మరో స్పిన్నర్‌ను తీసుకుంది. తొలి టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించిన క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు రెండో టెస్టు కోసం మరో స్పిన్నర్‌‍ను తీసుకుంది. ఎడమచేతివాటం స్పిన్నర్ మాట్ కుహ్నెమన్‌ను రంగంలోకి దించనుంది. కుహ్నెమన్ ఇప్పటిదాకా ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడలేదు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఓ ప్రకటన చేసింది. 
 
"లెగ్ స్పిన్నర్ మిచెల్ స్పెపన్స్ భార్య గర్భవతి. ఆమె కోసం స్వెప్సన్ స్వదేశానికి తిరిగి వెళుతున్నాడు. అతడి స్థానంలో కుహ్నెమన్‌ను ఎంపిక చేశాం. ఈ టెస్ట్ సిరీస్‌లని మిగతా మ్యాచ్‌లకు కుహ్నెమన్ అందుబాటులో ఉంటాడు" అని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఢిల్లీ జరిగే రెండు టెస్టులో సీనియర్ స్పిన్నర్ నాథన్ లైయన్, టాడీ మర్ఫీలతో కలిసి కుహ్నెమన్‌ స్పిన్ బాధ్యతలు పంచుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం