Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో సిరీస్ ఓటమి: శ్రీలంక కోచ్ పదవికి ఆట్టపట్టు రాజీనామా

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (13:19 IST)
భారత్‌తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌తో పాటు స్వదేశంలో రెండు వరుస సిరీస్ కోల్పోయిన శ్రీలంక క్రికెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ మర్వన్ ఆటపట్టు తన పదవికి గురువారం రాజీనామా చేశాడు. టీమిండియాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌‌ల సిరీస్‌ను శ్రీలంక 1-2తేడాతో కోల్పోయింది. అంతకుముందు స్వదేశంలో పాకిస్థాన్‌తో సిరీస్‌లో కూడా లంక ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో వరుస సిరీస్‌ ఓటములకు బాధ్యత వహిస్తూ ఆటపట్టు కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. అతని రాజీనామాను ఆమోదిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్‌ తాత్కాలిక అధ్యక్షుడు సిదాత్‌ వెట్టిముని తెలిపాడు. ఆటపట్టు శ్రీలంక తరఫున 90 టెస్టులు, 268 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5502, వన్డేల్లో 8529 పరుగులు సాధించాడు. శ్రీలంక జట్టుకు 2011 నుంచి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించిన ఆటపట్టు గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments