టీమిండియా గెలుపు కేరళ వరద బాధితులకు అంకితం... కోహ్లీ

ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

Webdunia
బుధవారం, 22 ఆగస్టు 2018 (18:54 IST)
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఇంగ్లండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఇంగ్లండ్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితమిస్తున్నామని చెప్పాడు. 
తన ఇన్నింగ్స్‌ను తన సతీమణి అనుష్కకు అంకితమిస్తున్నానని... ఆమె తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపాడు. తనలో స్ఫూర్తిని నింపిందని, తనను పాజిటివ్‌గా ఉంచే శక్తి ఆమెకు ఉందని కితాబిచ్చాడు. అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ పై పైచేయి సాధించామని కోహ్లి వెల్లడించాడు. 
 
ఇది తమకు కంప్లీట్ టెస్ట్ మ్యాచ్ అని.. జట్టు సభ్యులు మెరుగైన ఆటతీరును ప్రదర్శించారని తెలిపాడు. బౌలర్లు మరోసారి 20 వికెట్లను పడగొట్టారని కితాబిచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల మంచి ప్రదర్శనకు స్లిప్ క్యాచింగ్ తోడైతే... టెస్ట్ మ్యాచ్ గెలవడం ఖాయమని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments